Wednesday, November 16, 2016

సోదర సోదరీ మణులారా

     ఉన్నది కొద్దో గొప్పో! పట్టుకుని మనమందరం బ్యాంకుల ముందు బారులు తీరాం!

యాచకులతో సహా. కానీ మన పంచన నిలువలేని ఓ ఇద్దరి నిరుపేదల సంగతి 

మరచిపోయాం. మీరందరూ తలో రూపాయి వీరికి బిత్సం వేస్తే వాళ్ళనూ మనలో 

కలుపుకోవచ్చు. దేశాభివృద్ధిలో ఇకనైనా వారిని భాగస్వాములను చేయవొచ్చు. 

      అమ్మలారా అయ్యలారా! అందరూ ఆలోచించండి. మీ మీ స్థాయికి ఒక్క రూపాయి 

అంటే ఎంత? అందరూ ఒక్కొక్క రూపాయి వాళ్లకు విదల్చండి. ఓ యాచకా నీ చేయి 

పై నుండే రోజు నేటికి వచ్చింది. 

      నేటి వరకూ కూడా మన మధ్యకు వచ్చి ఠీవిగా నిలబడలేని కడుబీదలైన 

నల్ల కుబేరులను, రాజకీయ నాయకులను రూపాయి విదిల్చి ఆదుకోండమ్మ. 

       ఓ ప్రధాన మంత్రి వర్యా!

ఒక్క రూపాయి విరాళం భారతీయులమైన మేమంతా చెల్లించి వాళ్ళిద్దరినీ 

మా పంచకు చేర్చుకుంటాం. "స్వచ్ఛ భారత్" సెస్ లాగా "కాలా భారత్ " సెస్ 

అనే పన్నును ప్రకటించండి . మా వంతుగా ఓ రూపాయి డబ్బు జమ చేస్తాం. 

ఎందుకంటే! మేం సగటు భారతీయులం. తప్పు అనడం కన్నా! తప్పదు అనుకుని 

బ్రతికెటోల్లం. 



No comments:

Post a Comment